హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. ఎన్ఎస్యూఐ ధర్నా
ABN , First Publish Date - 2022-03-17T00:25:38+05:30 IST
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఎస్పీఎస్సీ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ..
హైదరాబాద్: గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఎస్పీఎస్సీ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఎన్ఎస్యూఐ ధర్నా నిర్వహించింది. గాంధీభవన్ రెండు గేట్ల నుంచి విద్యార్థులు దూసుకొచ్చారు. అడ్డుకున్న పోలీసులను విద్యార్థులు నెట్టేసి బయటకు వెళ్లారు. ఈ ఘటనతో పోలీసులు గాంధీభవన్ను చుట్టుముట్టారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.