హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. ఎన్‎ఎస్‎యూఐ ధర్నా

ABN , First Publish Date - 2022-03-17T00:25:38+05:30 IST

గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఎస్‎పీఎస్‎సీ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ..

హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. ఎన్‎ఎస్‎యూఐ ధర్నా

హైదరాబాద్: గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఎస్‎పీఎస్‎సీ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఎన్‎ఎస్‎యూఐ ధర్నా నిర్వహించింది. గాంధీభవన్ రెండు గేట్ల నుంచి విద్యార్థులు దూసుకొచ్చారు. అడ్డుకున్న పోలీసులను విద్యార్థులు నెట్టేసి బయటకు వెళ్లారు. ఈ ఘటనతో పోలీసులు గాంధీభవన్‎ను చుట్టుముట్టారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. 




Updated Date - 2022-03-17T00:25:38+05:30 IST