Hyderabad: ఊరెళ్లేందుకు కారు తీసుకుని అమ్మేశాడు..
ABN , First Publish Date - 2022-09-17T16:06:51+05:30 IST
ఊరెళ్లడానికి స్నేహితుడి వద్ద ఖరీదైన కారును తీసుకుని దానిని సెకండ్ హ్యాండ్లో అమ్మేశాడు. కొద్ది కాలానికి విషయం గమనించిన స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హైదరాబాద్/బంజారాహిల్స్: ఊరెళ్లడానికి స్నేహితుడి వద్ద ఖరీదైన కారును తీసుకుని దానిని సెకండ్ హ్యాండ్లో అమ్మేశాడు. కొద్ది కాలానికి విషయం గమనించిన స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 82కు చెందిన పనస రవికుమార్ వ్యాపారి. 2018లో రూ. 63 లక్షలు వెచ్చింది బెంజ్ కారు కొనుగోలు చేశాడు. బ్యాంక్లో రుణం తీసుకున్నాడు. అతడికి కొద్ది కాలం క్రితం కొంతం లక్ష్మీనారాయణగౌడ్తో పరిచయం ఏర్పడింది. అది స్నేహంగా మారింది. గతేడాది ఊరెళ్లడానికి రవికుమార్ కారును లక్ష్మీనారాయణ తీసుకెళ్లాడు. అప్పటి నుంచీ లక్ష్మీనారాయణ కారు ఇవ్వలేదు. అడిగినప్పుడల్లా ఏదో కారణం చెబుతూ వాయిదా వేసేవాడు. ఓసారి గట్టిగా ఒత్తిడి తెస్తే ఆ కారు తాను కొంటానని చెప్పాడు. రవి ఇటీవల వాకబు చేయగా లక్ష్మీనారాయణ కారును సెకండ్ హ్యాండ్ అమ్మకాల వెబ్సైట్లో పెట్టి అమ్మేసినట్టు తెలిసింది. తన సంతకాలను ఫోర్జరీ చేసి కారు అమ్మినట్లు రవి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.