Viral: మంథని రూరల్ మండలంలో భర్తను కట్టేసి కొట్టిన భార్య.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-09-20T03:19:21+05:30 IST

మూడేళ్లుగా తనను కాపురానికి తీసుకెళ్లకపోవడంతోపాటు తన కుమారుడిని పట్టించుకోవడం లేదంటూ ఓ మహిళ భర్తను చెప్పుతో..

Viral: మంథని రూరల్ మండలంలో భర్తను కట్టేసి కొట్టిన భార్య.. కారణం ఏంటంటే..

మంథని రూరల్‌: మూడేళ్లుగా తనను కాపురానికి తీసుకెళ్లకపోవడంతోపాటు తన కుమారుడిని పట్టించుకోవడం లేదంటూ ఓ మహిళ భర్తను చెప్పుతో కొట్టింది. మంథని రూరల్‌ మండలంలోని స్వర్ణపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అఖిలకు 4 ఏళ్ల క్రితం హన్మకొండకు చెందిన శ్రీకాంత్‌రెడ్డితో వివాహం జరిగింది. ఐదు నెలల అనంతరం అఖిల గర్భం దాల్చడంతో పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి శ్రీకాంత్‌రెడ్డి అఖిలను తీసుకెళ్లడం లేదు. కొడుకు పుట్టినా కూడా చూడటానికి రాలేదని, మూడు సంవత్సరాలుగా అఖిలను, కుమారుడిని పట్టించుకోవవడంతో శ్రీకాంత్‌రెడ్డి మరో వివాహం చేసుకున్నాడని ఆరోపిస్తూ శ్రీకాంత్‌రెడ్డిని అఖిల కుటుంబ సభ్యులు శనివారం తెల్లవారుజామున స్వర్ణపల్లి గ్రామానికి తీసుకు వచ్చారు. గ్రామంలోని కరెంట్‌ స్తంభానికి కట్టివేసి అఖిల చెప్పులతో కొట్టింది. ఎస్‌ఐ మాట్లాడుతూ.. విషయం తెలియంగానే స్టేషన్‌కు తీసుకువచ్చామన్నారు. వరంగల్‌ కాకతీయ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కేసు నడుస్తోందన్నారు. ఇరుపక్షాల వారిని అక్కడికి పంపించామన్నారు.

Updated Date - 2022-09-20T03:19:21+05:30 IST