TS News: కుటుంబకలహాలతో ఆత్మహత్యాయత్నం భార్యభర్త మృతి - కొడుకు పరిస్థితి విషమం

ABN , First Publish Date - 2022-11-24T20:15:43+05:30 IST

Warangal: క్షణికావేశంలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో భార్యభర్తలు మృతి చెందగా.. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన వరంగల్

TS News: కుటుంబకలహాలతో ఆత్మహత్యాయత్నం భార్యభర్త మృతి - కొడుకు పరిస్థితి విషమం

Warangal: క్షణికావేశంలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో భార్యభర్తలు మృతి చెందగా.. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన వరంగల్ గిర్మానిపేటలో జరిగింది. నవధాన్(33) స్రవంతి(28) భార్యభర్తలు. వీరికి ఇద్దరు కొడుకులు. నవధన్ గోల్డ్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలు నవధాన్(33) స్రవంతి(28), పెద్ద కొడుకు విషం తాగారు. విష ప్రభావానికి నవధాన్(33) స్రవంతి(28) మృత్యువాతపడగా.. పెద్ద కొడుకు పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం‌కు తరలించారు.

Updated Date - 2022-11-24T20:15:44+05:30 IST