TS News: హైదరాబాద్లో బాలిక ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-09-19T16:36:17+05:30 IST
నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక ఆత్మహత్య కలకలం రేపుతోంది.
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక ఆత్మహత్య కలకలం రేపుతోంది. గోపనపల్లి ఎన్టీఆర్ నగర్లో రాణి(15) అనే బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసముంటోంది. ఇంట్లో పని విషయంలో రాణిని తల్లి హీరా భాయ్ మందలించింది. ఈ క్రమంలో నిన్న ఉదయం నుంచి బాలిక కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతూ బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా... ఈరోజు ఉదయం సమీపంలోని కుంటలో రాణి శవమై తేలింది. మృతురాలి తండ్రి నాను ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ కుటుంబం నాలుగు నెలల క్రితమే మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూల్ నుంచి హైదరాబాద్కు వలస వచ్చింది. ఇంతలోనే బాలిక మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా గచ్చిబౌలి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.