నీట్, జేఈఈ, ఎంసెట్కు ఫ్రీ ఆన్లైన్ కోచింగ్
ABN , First Publish Date - 2022-06-07T08:56:15+05:30 IST
నీట్, జేఈఈ, ఎంసెట్కు ఫ్రీ ఆన్లైన్ కోచింగ్
హైదరాబాద్, జూన్ 6(ఆంధ్రజ్యోతి): జాతీయ, రాష్ట్ర స్థాయిలో వైద్య, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత ఆన్లైన్ కోచింగ్ ఇవ్వనున్నారు. నీట్, ఎంసెట్, జేఈఈ, సీఏసీపీటీ వంటి ప్రవేశ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కోసం దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ ఉచిత ప్రభుత్వ ఆన్లైన్ కోచింగ్ను సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కార్యాలయంలో ప్రారంభించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. జ్ట్టిఞ://్టటఛిజ్ఛీ.ట్చుఽజుట.జీుఽ లింక్ ద్వారా అభ్యర్థులు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. కాగా, రాష్ట్రంలో నిర్వహిస్తున్న బడి బాట కార్యక్రమం ద్వారా సోమవారం వరకు 27,653 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు.