రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-08-31T08:44:38+05:30 IST
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డిపల్లిలో రైతు కొనకంటి రాజేందర్ (35)అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.
మొగుళ్లపల్లి, ఆగస్టు 30: భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డిపల్లిలో రైతు కొనకంటి రాజేందర్ (35)అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేందర్ రెండెకరాల్లో పత్తి పంట వేయగా, వర్షాలకు పంట దెబ్బతింది. అప్పులు ఎలా తీర్చాలన్న దిగులుతో మంగళవారం ఉరేసుకున్నాడు.