సాగు దగా.. రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-07-18T09:17:21+05:30 IST
సాగు దగా.. రైతు ఆత్మహత్య
బజార్హత్నూర్, జూలై 17: ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రానికి చెందిన రైతు తేలి శ్రీనివాస్(47) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తనకున్న ఐదు ఎకరాలతోపాటు పదిహేను ఎకరాలు కౌలుకు తీసుకుని అప్పులు తెచ్చి సోయా, పత్తి వేశారు. కాలం కలిసిరాక నష్టపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన శ్రీనివాస్.. బలవన్మరణానికి పాల్పడ్డారు.