Casino caseలో ఏడుగురికి ఈడీ నోటీసులు

ABN , First Publish Date - 2022-07-30T20:11:43+05:30 IST

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో ఏడుగురికి ఈడీ నోటీసులు జారీ చేసింది.

Casino caseలో ఏడుగురికి ఈడీ నోటీసులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన క్యాసినో కేసు(Casino case)లో ఏడుగురికి ఈడీ (ED) నోటీసులు జారీ చేసింది. చీకోటి ప్రవీణ్‌ (Chikoti praveen), మాధవరెడ్డి (Madhava reddy), సంపత్‌(Sampath) సహా హవాలా ఏజెంట్లకు నోటీసులు జారీ అయ్యాయి.  సోమవారం ఈడీ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ప్రవీణ్‌, మాధవరెడ్డి బ్యాంకు ఖాతాల్లో రూ.25 కోట్ల లావాదేవీలను ఈడీ  గుర్తించింది. రాజకీయనేతలు, అధికారులకు ప్రవీణ్‌, మాధవరెడ్డి ఖాతాల నుంచి నగదు బదిలీ అయ్యాయి. ఏడాది వ్యవధిలో 4 క్యాసినో ఈవెంట్లు నిర్వహించినట్టు గుర్తించారు. గోవా, శ్రీలంక, నేపాల్‌, థాయిలాండ్‌లో క్యాసినో నిర్వహణ, హవాలా ద్వారా నగదు బదిలీ అయినట్లు తెలుస్తోంది. అలాగే బేగంబజార్‌, జూబ్లీహిల్స్‌కు చెందిన ఇద్దరు హవాలా ఏజెంట్ల ద్వారా నగదు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘనపైనా ఈడీ అధికారులు  ఆధారాలు సేకరించారు. 

Updated Date - 2022-07-30T20:11:43+05:30 IST