దేశంలో 164.44 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-28T20:06:41+05:30 IST

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.

దేశంలో 164.44 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ నినాదంతో ముందుకు పోతోంది. ఈ మేరకు ఇప్పటి వరకూ 164.44 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గడిచిన 24 గంటల్లో 57లక్షల వ్యాక్సిన్ డోసులను వేసినట్టు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 93.60 శాతంగా అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లలో కొత్తగా 2,51,209 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21,05,611 వుంది. వీక్లీ పాజిటివిటీ రేట్ 17.47 శాతంగా అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-28T20:06:41+05:30 IST