మేడారం జాతర హుండీల లెక్కింపు
ABN , First Publish Date - 2022-02-24T01:51:13+05:30 IST
అత్యంత వైభవంగా జరిగిన మేడారం జాతర హుండీల లెక్కింపును
హన్మకొండ: అత్యంత వైభవంగా జరిగిన మేడారం జాతర హుండీల లెక్కింపును నిర్వహించారు. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం 497 హుండీల్లో ఇప్పటివరకు 65 హుండీలను తెరిచారు. ఇప్పటివరకు రూ.1,34,60,000ల ఆదాయం వచ్చింది. ఈ డబ్బును అధికారులు బ్యాంక్లో జమ చేశారు.
మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది.ఈ జాతరకు కోటి మందికి పైగా భక్తులు వచ్చారు. ఆసియాలోనే అతిపెద్దదైన గిరిజన జాతరగా మేడారం జాతరకు పేరుంది.