మండల కేంద్రాల్లో కాంగ్రెస్ నిరసనలు
ABN , First Publish Date - 2022-11-25T03:57:20+05:30 IST
వ్యవసాయ, భూసమస్యలపై టీపీసీసీ పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ, భూసమస్యలపై టీపీసీసీ పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవసాయదారుల సమస్యలు, భూ వివాదాలను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు.