Malluravi: సంగారెడ్డి కలెక్టర్ వ్యాఖ్యలపై మల్లురవి అభ్యంతరం
ABN , First Publish Date - 2022-09-19T15:56:42+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి సంగారెడ్డి కలెక్టర్ శరత్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి అభ్యంతరం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)ను అంబేద్కర్తో పోల్చుతూ సంగారెడ్డి కలెక్టర్ శరత్ (Sharat) చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి (Mallu ravi) అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ (Telangana CM)ను అభినవ అంబేద్కర్ అని, బాబా సాహెబ్ను సీఎంలో చూస్తున్నానంటూ కలెక్టర్ శరత్ (Sangareddy collector) అన్నారు. అయితే ఒక ఐఏఎస్ అధికారి ఇలా మాట్లాడడం అంబేద్కర్ను అవమానించడమే అని తెలిపారు. 8 ఏళ్లుగా గిరిజన రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేసిన కేసీఆర్ (CM KCR).. ఏ విధంగా అభినవ అంబేద్కర్ అవుతారని ప్రశ్నించారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు కూడా ఇలా మాట్లాడితే ఇక ప్రజలకు ఏం సేవలు చేస్తారని మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.