జిల్లాల్లో కాంగ్రెస్ ‘ఆజాదీకా గౌరవ్’ యాత్రలు
ABN , First Publish Date - 2022-08-10T09:42:53+05:30 IST
క్విట్ ఇండియా దినోత్సవం నుంచి స్వాతంత్య్ర దినోత్సవం వరకు ఆజాదీ కా గౌరవ్ యాత్ర చేపట్టాలని ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో డీసీసీల ఆధ్వర్యంలో యాత్ర మొదలైంది.
హైదరాబాద్, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): క్విట్ ఇండియా దినోత్సవం నుంచి స్వాతంత్య్ర దినోత్సవం వరకు ఆజాదీ కా గౌరవ్ యాత్ర చేపట్టాలని ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో డీసీసీల ఆధ్వర్యంలో యాత్ర మొదలైంది. మంగళవారం నుంచి 15 వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ప్రతి జిల్లాలో జాతీయ జెండాలు చేబూని 75 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. ఇందులో భాగంగా దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో స్థానిక కాంగ్రెస్ నేతలు యాత్ర మొదలుపెట్టారు.