గురుకుల విద్యార్థులకు నగదు పురస్కారాలు

ABN , First Publish Date - 2022-02-16T08:28:00+05:30 IST

ఐఐటీ, వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పొందిన గురుకుల విద్యార్థులకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ల్యాప్‌టా్‌పలు, నగదు పురస్కారాలు

గురుకుల విద్యార్థులకు నగదు పురస్కారాలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): ఐఐటీ, వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పొందిన గురుకుల విద్యార్థులకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ల్యాప్‌టా్‌పలు, నగదు పురస్కారాలు అందించారు. మాసబ్‌ట్యాంక్‌ దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో మంగళవారం ఎంబీబీఎస్‌, ఐఐటీల్లో చదువుతున్న 151 మందికి ల్యాప్‌టా్‌పలు, 196 మందికి 50 వేల చొప్పున ఆర్థికసాయం, క్రీడల్లో ప్రతిభ కనబర్చిన 11 మందికి నగదు పురస్కారాలు అందజేశారు. 


Updated Date - 2022-02-16T08:28:00+05:30 IST