ఈ ఇద్దరివీ అమృత పలుకులే..

ABN , First Publish Date - 2022-08-15T10:23:06+05:30 IST

ఆధునిక ప్రపంచ అనుభవాలను, వలసపాలన విషాదాలను మనస్సులో ఉంచుకుని వందల ఏళ్ల తర్వాత ఏకమైన జాతి సాధించాల్సి లక్ష్యాలను ఆ ప్రసంగాలు కళ్లకుకట్టాయి.

ఈ ఇద్దరివీ అమృత పలుకులే..

 ఆధునిక ప్రపంచ అనుభవాలను, వలసపాలన విషాదాలను మనస్సులో ఉంచుకుని వందల ఏళ్ల తర్వాత ఏకమైన జాతి సాధించాల్సి లక్ష్యాలను ఆ ప్రసంగాలు కళ్లకుకట్టాయి. స్వతంత్ర భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, భారత రాజ్యాంగ రచనా సంఘం సారథి బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 75 ఏళ్ల కిందట చేసిన ప్రసంగాలను ఇప్పటికీ దేశదేశాల్లో ఆలోనాపరులు అధ్యయనం చేస్తూనే ఉన్నారు. 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి రాజ్యాంగ సభ సభ్యులనుద్దేశించి నెహ్రూ చేసిన (ట్రిస్ట్‌ విత్‌ డెస్టిని) ప్రసంగాన్ని.. మరో రెండేళ్ల తర్వాత 1949 నవంబరు 25న అంబేడ్కర్‌ రాజ్యాంగ పరిషత్తులో చేసిన ప్రసంగాన్ని ఒక్కసారి మనసుపెట్టి చదివితే జీవితంలో మరిచిపోలేం. ఒక జాతిని, ఒక నాగరికతను పొగడ్తలతో ముంచెత్తిన ఉపన్యాసాలేవి గొప్పవి అనిపించుకోలేవు. 


అహింసతోనూ లేక అతి తక్కువ హింసతోనూ మరే ఇతర దేశం చూడని చాకచక్యంతోనూ మనం స్వాతంత్య్రం సంపాదించుకున్నాం. ప్రపంచంలో ఏదేశమూ ఒక్కసారిగా ఇవ్వనన్ని ప్రాథమిక హక్కులనూ స్త్రీపురుష సమానత్వ హక్కులనూ మన రాజ్యాంగ రూపకర్తలు ఇచ్చారు. అంతమాత్రాన మన సమాజానికి ఆ హక్కులను పరిరక్షించే, నిజాయితీగా అమలుచేయగలిగే శక్తి ఉందని ఆ ఇద్దరూ భావించలేదు. అందుకే మనకెన్నో సవాళ్లు, ప్రతికూలతలు ఉన్నాయని హెచ్చరించారు. వ్యక్తిపూజ, సంకుచిత మతతత్వం, కులతత్వం జాతీయవాదాల గురించి తస్మాత్‌ జాగ్రత్త ఆనాడే చెప్పారు. అమృత మహోత్సవ కాలంలోనూ ఇంకా అవే పెనుప్రమాదాలుగా ఉండటం వారి భవిష్యద్దార్శనికతకు నిదర్శనం.

Updated Date - 2022-08-15T10:23:06+05:30 IST