Bandi Sanjay: మంత్రి హరీష్ రావుని బర్తరఫ్ చేయాలి
ABN , First Publish Date - 2022-09-01T03:52:38+05:30 IST
ఇబ్రహీంపట్నం ఘటనలో మంత్రి హరీష్ రావుని బర్త్ రఫ్ చేసి సీఎం కేసీఆర్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని..
హైదరాబాద్ (Hyderabad): ఇబ్రహీంపట్నం ఘటనలో మంత్రి హరీష్ రావు (Minister HarishRao)ని బర్తరఫ్ చేసి సీఎం కేసీఆర్ (Cm Kcr) చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bjp Telangana State Bandi Sanjay) అన్నారు. మంత్రి హరీష్ రావును కాపాడేందుకే సీఎం కేసీఆర్ ఇబ్రహీంపట్నం ఘటనలో డాక్టర్లను బలి పశువులను చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం ఘటనపై నివేదిక తెప్పించుకోకుండానే డాక్టర్ల లైసెన్స్ను రద్దు చేస్తామని చెప్పడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు కల్పించడం చేతకాని కేసీఆర్ .. తన అల్లుడిని రక్షించడానికి డాక్టర్స్ని బలి చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.