బీజేపీపై అవాస్తవాలు ప్రచారం: తరుణ్చుగ్
ABN , First Publish Date - 2022-02-23T19:36:50+05:30 IST
టీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ నేతలపై దాడులు చేస్తున్నారని తెలంగాణ బీజేపీ ఇన్చార్జ్ తరుణ్చుగ్ అన్నారు.
న్యూఢిల్లీ: టీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ నేతలపై దాడులు చేస్తున్నారని తెలంగాణ బీజేపీ ఇన్చార్జ్ తరుణ్చుగ్ అన్నారు. బీజేపీపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ను తెలంగాణ ప్రజలు గద్దె దించాలని భావిస్తున్నారన్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసే సత్తా.. కేసీఆర్కు లేదని సంజయ్ రౌత్ అన్నారని తెలిపారు. ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు సరైన బుద్ధి చెబుతారని తరుణ్చుగ్ పేర్కొన్నారు.