BJP Sabha: రెండు లక్షల మందితో బీజేపీ సభ: మనోహరరెడ్డి

ABN , First Publish Date - 2022-07-28T19:31:15+05:30 IST

మూడోవిడత పాదయాత్ర ముగింపు సందర్భంగా వరంగల్‌‌లో రెండు లక్షల మందిలో బీజేపీ సభ నిర్వహించనున్నట్లు ఆపార్టీ ఉపాధ్యక్షుడు మనోహరరెడ్డి తెలిపారు.

BJP Sabha: రెండు లక్షల మందితో బీజేపీ సభ: మనోహరరెడ్డి

హైదరాబాద్: మూడోవిడత పాదయాత్ర ముగింపు సందర్భంగా వరంగల్‌‌లో రెండు లక్షల మందిలో బీజేపీ(BJP) సభ నిర్వహించనున్నట్లు ఆపార్టీ ఉపాధ్యక్షుడు మనోహరరెడ్డి(Manohar reddy) తెలిపారు. గురువారం మూడోవిడత పాదయాత్ర పోస్టర్‌ను  బీజేపీ నేతలు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఆగస్ట్ 2న యాదగిరిగుట్టలో లక్ష మందితో పాదయాత్ర(Padayatra) ప్రారంభ సభకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రారంభ సభకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిడ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని  తెలిపారు. ఆగస్ట్ 26న వరంగల్ ముగింపు సభకు జేపీ నడ్డాను ఆహ్వానించాలనుకుంటున్నామని ఆయన అన్నారు.  బహిరంగ సభలకు జనసమీకరణ  బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగించామని తెలిపారు. చారిత్రాత్మకమైన ప్రాంతాలను నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మూడోవిడత ప్రజా సంగ్రామయాత్ర కొనసాగుతుందన్నారు. ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని  పోచంపల్లిలో నిర్వహిస్తామని అన్నారు. పాదయాత్రలో అనేక మంది జాతీయ నేతలు, కేంద్రమంత్రులు పాల్గొంటారని మనోహరరెడ్డి వెల్లడించారు. 

Updated Date - 2022-07-28T19:31:15+05:30 IST