ప్రాణహిత జలాల కోసం బీజేపీ ఆందోళన బాట
ABN , First Publish Date - 2022-04-05T14:00:05+05:30 IST
ప్రాణహిత జలాల కోసం బీజేపీ ఆందోళన బాట పట్టింది.
కొమురం భీం జిల్లా: ప్రాణహిత జలాల కోసం బీజేపీ ఆందోళన బాట పట్టింది. సిర్పూర్ నియోజకవర్గంలో బీజేపీ నేత డా. పాల్వాయి హరీష్ బాబు పాదయాత్ర మూడో రోజూ కొనసాగుతోంది. ప్రాణహిత పరివాహక ప్రాంతాలకు నీరివ్వకుండా సీఎం కేసీఆర్ మోసం చేశారని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ప్రాణహిత ప్రాణం తీశారని కేసీఆర్ తీరుపై పాల్వాయి హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.