TS News: బండి సంజయ్ మతకల్లోలాలను రెచ్చగొడుతున్నారు: భట్టి విక్రమార్క

ABN , First Publish Date - 2022-09-25T22:23:42+05:30 IST

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేస్తున్నది పాదయాత్ర కాదు... విషయాత్ర.. విషప్రచారం చేస్తూ రాష్ట్రంలో మతకల్లోలాలను రెచ్చగొడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

TS News: బండి సంజయ్ మతకల్లోలాలను రెచ్చగొడుతున్నారు: భట్టి విక్రమార్క

నల్గొండ: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) చేస్తున్నది పాదయాత్ర కాదు... విషయాత్ర.. విషప్రచారం చేస్తూ రాష్ట్రంలో మతకల్లోలాలను రెచ్చగొడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మునుగోడు(MUNUGODU)లో పర్యటించారు. ఈసందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ(BJP) వల్ల సామాన్యులపై ధరల భారం పడుతుందన్నారు. టీఆర్ఎస్(TRS) రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదని, డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించలేదని ధ్వజమెత్తారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్(CONGRESS) పార్టీని గెలిపిస్తే గతంలో మాదిరిగా రైతులు ఆత్మగౌరవంతో బతుకుతారని, రైతులకు రుణమాఫీ జరుగుతుందని చెప్పారు. దేశం సంపద అంతా అదానీ, అంబానీలకు పోవద్దంటే కాంగ్రెస్‌ని మునుగోడు ఉప ఎన్నికలో ఆదరించాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Updated Date - 2022-09-25T22:23:42+05:30 IST