Bhadradri Kothagudem: జేకే 5 ఉపరితల గనిలో సెక్యూరిటీపై దొంగల దాడి
ABN , First Publish Date - 2022-09-05T16:20:54+05:30 IST
ఇల్లందులో దొంగలు బీభత్సం సృష్టించారు. జేకే 5 ఉపరితల గనిలో సింగరేణి సెక్యూరిటీ అధికారిపై దొంగలు రాళ్లతో దాడి
Bhadradri Kothagudem District: ఇల్లందులో దొంగలు బీభత్సం సృష్టించారు. జేకే 5 ఉపరితల గనిలో సింగరేణి సెక్యూరిటీ అధికారిపై దొంగలు రాళ్లతో దాడి చేశారు. బేస్ క్యాంపులో దొంగతనానికి వచ్చిన ఐదుగురిలో సెక్యూరిటీ సిబ్బందిని ఒకరిని పట్టుకున్నాడు. అయితే.. దొంగని పట్టుకునే క్రమంలో దుండగుడు అధికారి రమణారెడ్డిపై దాడి చేశాడు. దుండగుడి దాడిలో రమణ తలకు తీవ్రగాయాలయ్యాయి. సెక్యూరిటీని సిబ్బంది మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జేకే గనికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేష్టన్కు తరలించారు.