అసెంబ్లీ ముట్టడికి పంచాయతీ కార్యదర్శుల యత్నం
ABN , First Publish Date - 2022-09-13T09:57:23+05:30 IST
ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో కారణంగా సొంత జిల్లాలను వదిలి..
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో కారణంగా సొంత జిల్లాలను వదిలి.. ఇతర జిల్లా, జోన్ల పరిధిలో పని చేయాల్సి వస్తోందని ఆరోపిస్తూ పలువురు పంచాయతీ కార్యదర్శులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ముందస్తు సమాచారం ఉండటంతో వివిధ ప్రాంతాల్లో పోలీసులు కట్టడి చేసినప్పటికీ.. కొందరు అసెంబ్లీ పరిసరాల్లోకి చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకొని, అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు నివేదించినా తమ సమస్యను పరిష్కరించకపోగా.. కనీసం సమీక్షించడం లేదని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు పి.మధుసూదన్రెడ్డి, పండరి, ప్రవీణ్, వెంకట రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.