బీసీ గురుకుల లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2022-09-08T10:06:55+05:30 IST
మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల(బీసీ) గురుకుల కళాశాలల్లో తాత్కాలిక పద్ధతిన లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల(బీసీ) గురుకుల కళాశాలల్లో తాత్కాలిక పద్ధతిన లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ)లో ఐఐటీ, జేఈఈ మెయిన్స్ విద్యార్థులకు ఆంగ్లం, గణితం, భౌతిక, రసాయన, జంతు తదితర శాస్త్రాల్లోని పాఠ్యాంశాలను బోధించాల్సి ఉంటుందని వెల్లడించారు. అభ్యర్ధులు ఈ నెల 12లోగా సరూర్నగర్లోని బీసీ గురుకుల కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.