‘పోలవరం ప్రాజెక్టు అథారిటీ తరలింపు చర్చ జరగలేదు’

ABN , First Publish Date - 2022-11-16T20:01:16+05:30 IST

పోలవరం అథారిటీ భేటీలో తెలంగాణ తరపున ముంపు సర్వే చేయమని కోరినట్లు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ తెలిపారు.

‘పోలవరం ప్రాజెక్టు అథారిటీ తరలింపు చర్చ జరగలేదు’

హైదరాబాద్: పోలవరం అథారిటీ భేటీలో తెలంగాణ తరపున ముంపు సర్వే చేయమని కోరినట్లు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సర్వే జరుగుతుందని అథారిటీ చెప్పిందన్నారు. పోలవరం బ్యాక్ వాటర్‌పై స్టడీని సీడబ్ల్యూసీ చేస్తుందని ఆయన చెప్పారు. ఏపీ సెక్రటరీ కూడా సర్వేకు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ తరలింపు చర్చ జరగలేదని ఈఎన్సీ మురళీధర్‌ తెలిపారు.

Updated Date - 2022-11-16T20:01:27+05:30 IST