Amit Shah: బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకున్న అమిత్ షా

ABN , First Publish Date - 2022-08-21T20:10:09+05:30 IST

బేగంపేట్ ఎయిర్పోర్టుకు కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) చేరుకున్నారు. ఆయనకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి

Amit Shah: బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకున్న అమిత్ షా

హైదరాబాద్: బేగంపేట్ ఎయిర్పోర్టుకు కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) చేరుకున్నారు. ఆయనకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Union Minister Kishan Reddy), తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్ స్వాగతం పలికారు. బేగంపేట్ ఎయిర్పోర్టు (Begumpet Airport) నుంచి నేరుగా సికింద్రాబాద్‌ (Secunderabad)లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి వెళ్తారు. ప్రత్యేక పూజల అనంతరం 2:40 గంటలకు సికింద్రాబాద్‌లో బీజేపీ కార్యకర్త ఎన్‌.సత్యనారాయణ నివాసంలో టీ తాగి.... 3:15 గంటలకు బేగంపేటలోని రమదా మనోహర్‌ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ కొంత మంది రైతు ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం 4.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరి మునుగోడుకు చేరుకుంటారు. మునుగోడులో సాయంత్రం 5 గంటల దాకా సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభకు హాజరవుతారు. అక్కడ నుంచి 6:50 గంటలకు రామోజీ ఫిలింసిటీకి చేరుకుంటారు. అక్కడి నుంచి 7:20 గంటలకు బయలుదేరి శంషాబాద్‌లోని హోటల్‌ నోవాటెల్‌కు చేరుకుంటారు. అక్కడ డిన్నర్‌, ముఖ్యనేతలతో భేటీ అనంతరం రాత్రి 9:30 గంటలకు బయలు దేరి తిరిగి ఢిల్లీ వెళ్తారు.

Updated Date - 2022-08-21T20:10:09+05:30 IST