ఘనంగా దుర్గామాత పూజలు

ABN , First Publish Date - 2022-10-02T03:49:22+05:30 IST

విశ్వనాథ ఆలయ కాలక్షేప మండ పంలో శనివారం సర్వజనని దుర్గామాత సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గా మాతను ప్రతిష్టించారు. ఎమ్మెల్యే సతీమణి పాల్గొని పూజలు నిర్వహించారు. చిన్నారులు దుర్గామాత వేషధారణలో అలరించారు.

ఘనంగా దుర్గామాత పూజలు
చెన్నూరులో కరెన్సీతో అలంకరించిన దుర్గామాత

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు  1: విశ్వనాథ ఆలయ కాలక్షేప మండ పంలో శనివారం సర్వజనని దుర్గామాత సేవా సమితి ఆధ్వర్యంలో  దుర్గా మాతను ప్రతిష్టించారు. ఎమ్మెల్యే సతీమణి పాల్గొని పూజలు నిర్వహించారు. చిన్నారులు దుర్గామాత వేషధారణలో అలరించారు.  మున్సిపల్‌ చైర్మన్‌ పెం ట రాజయ్య, ఆలయ పాలక మండలి చైర్మన్‌ శ్రీపతి శ్రీనివాస్‌, యువ నాయ కుడు విజిత్‌రావు, డైరెక్టర్‌ రీనారాణీదాస్‌, ధర్మేందర్‌, సరోజ, పాల్గొన్నారు.  

బెల్లంపల్లి: పట్టణంలోని 21, 22 వార్డుల్లో ప్రతిష్టించిన దుర్గాదేవిని  ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దర్శించుకున్నారు.  టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ అధికా ర ప్రతినిధి లక్ష్మణ్‌, టీఆర్‌ఎస్‌వై పట్టణాధ్యక్షుడు సన్నిబాబు పాల్గొన్నారు. 

చెన్నూరు: పట్టణంలోని ఆర్యవైశ్య భవన్‌లో ప్రతిష్టించిన దుర్గామాతను రూ. 33,33,333లతో అలంకరించారు. 

కాసిపేట: వర్తక సంఘం ఆధ్వర్యంలో  దుర్గామాతను రూ.1,11,111లతో అమ్మవారిని అలంకరించి పూజలు చేశారు.   

Updated Date - 2022-10-02T03:49:22+05:30 IST