స్టేడియం నిర్మాణం ఎప్పుడు?
ABN , First Publish Date - 2022-11-28T22:51:21+05:30 IST
జిల్లాలో మెయిన్ స్టేడియం నిర్మాణానికి మోక్షం కలగక పోవడంతో క్రీడాకారులకు తిప్పలు తప్పడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మంచిర్యాలకు క్రీడలకు పుట్టినిల్లుగా పేరుంది. జిల్లాలో క్రీడాకారుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. కాగా స్టేడియం లేనికారణంగా క్రీడాకా రులు సాధన చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
- కేంద్ర నిధులతో కొనుగోలు..పనులకు లభించని ఆమోదం
- అధికారుల వైఖరితో ఆటగాళ్లకు అవస్థలు
జిల్లాలో మెయిన్ స్టేడియం నిర్మాణానికి మోక్షం కలగక పోవడంతో క్రీడాకారులకు తిప్పలు తప్పడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మంచిర్యాలకు క్రీడలకు పుట్టినిల్లుగా పేరుంది. జిల్లాలో క్రీడాకారుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. కాగా స్టేడియం లేనికారణంగా క్రీడాకా రులు సాధన చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
మంచిర్యాల, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో మెయిన్ స్టేడియం నిర్మాణం చేపట్టాలని దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. కాగా అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లిప్తిత కారణంగా అడుగులు ముందుకు పడడం లేదు. మంచిర్యాల పట్టణం మీదుగా హైదరాబాద్-న్యూఢిల్లీ ప్రధా న రైల్వే మార్గం వెళుతుండడంతో క్రీడాకారుల రాకపోకలకు అనువైనదిగా పేరుగాంచింది. ఉమ్మడి జిల్లాలోని తూర్పు ప్రాంతమైన మంచిర్యాలకు చెందిన పలువురు క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించి పతకాలు సాధించారు. జిల్లాలు వేరుపడి మంచిర్యాల ప్రత్యేక జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ తరువాత క్రీడల పట్ల మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తు తం జిల్లా వ్యాప్తంగా వివిధ క్రీడలకు సంబంధించి 10వేల మంది క్రీడాకా రులు ఉంటారంటే అతిశయోక్తి కాదు. వివిధ క్రీడలతోపాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కెడేట్లకు ఇక్కడ కొదువ లేదు. ఎన్సీసీకి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మంచిర్యాల కేంద్రంగా ప్రత్యేక బెటాలియన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ముందుకు వచ్చాయంటే క్రీడలకు ఎంతటి ప్రాధాన్యం ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
జిల్లా వ్యాప్తంగా..
జిల్లా వ్యాప్తంగా క్రీడలకు సంబంధించి మెయిన్ స్టేడియం ఎక్కడా లేదు. శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, బెల్లంపల్లిలో స్టేడియాలు ఉన్నప్పటికీ అవి పూర్తిస్థాయి క్రీడా పోటీల నిర్వహణకు అందుబాటులో లేవు. మె యిన్ స్టేడియం నిర్మాణానికి కనీసం 10 ఎకరాలు అవసరం ఉండడంతో సరిపడా స్థలం కేటాయింపులు లేక ఆ అంశం మరుగున పడింది. ఇదిలా ఉండగా మండలానికో స్టేడియం ఉండాలనే ప్రభుత్వ నిబంధనలతో జిల్లా కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం తెరపైకి వచ్చింది. తక్కువ స్థలం అవసరం కావడంతో స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానాన్ని ఎంపిక చేశారు. స్థానిక నివాసి గడ్డం దుర్గయ్య అనే వ్యక్తి నుంచి 10-03-1969న పట్టణంలోని ఎఫ్సీఏ ఫంక్షన్హాలు నిర్వాహకులు 6.02 ఎకరాల స్థలాన్ని కొనుగోలుచేసి పాఠశాలకు విరాళంగా ఇచ్చారు. అనంతరం ప్రభుత్వం ఆ స్థలంలో పాఠశాల భవనాన్ని నిర్మించగా మరో 4. 5 ఎకరాల్లో విద్యార్థుల ఉపయోగార్థం క్రీడా మైదానం ఏర్పాటు చేశా రు. ఆ మైదానంలో మినీ స్టేడియం నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనలు తెరపైకి రాగా క్రీడలశాఖ రూ. 2 కోట్ల నిధులు కూడా మంజూరు చేసిం ది. అయితే స్టేడియం నిర్మాణ ప్రతిపాదనలకు విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు అభ్యంతరం తెలపడంతో 15-11-1988న విచారణ జరిపిన అప్పటి ఉమ్మడి జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్కే సిన్హా పాఠశాలకు కేటాయించిన స్థలం ప్రభుత్వ భూమికాదని స్పష్టం చేశారు. దీంతో స్టేడియం నిర్మాణానికి ఆటంకాలు మొదలు కాగా మంజూరైన నిధులు కూడా వెనక్కి మళ్లాయి.
స్థలం అప్పగింత..
మినీ స్టేడియం నిర్మాణంలో తరుచుగా అభ్యంతరాలు వ్యక్తం అవుతుం డడంతో శాశ్వత పరిష్కారం దిశగా అప్పటి యంత్రాంగం చర్యలు చేపట్టింది. 2014లో అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మం చిర్యాల తహసీల్దార్ పాఠశాల స్థలాన్ని అధికారికంగా స్పోర్ట్స్ అథారిటీకి అప్పగిస్తూ ప్రొసీడింగ్ ఇచ్చారు. దీంతో స్టేడియం నిర్మాణానికి లైన్ క్లియర్ కాగా క్రీడలశాఖ నుంచి అవసరమైన నిధులు మంజూరయ్యాయి. స్టేడియం నిర్మాణం కోసం 2015లో రూ. 2.10 కోట్లు మంజూరుకాగా అంచనా వ్యయం పెరగడంతో మరో రూ. 55 లక్షలను అదనంగా కేటాయించారు. స్పోర్ట్ అథారిటీ చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి 2019లో మినీ స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా రూ. 2. 65 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 4.5 ఎకరాల మైదానంలో 1000 చదరపు గజాల స్థలంలో మినీ స్టేడియం నిర్మాణం చేపడుతుండగా, ఇండోర్ గేమ్స్తో పాటు రెండు బ్యాడ్మింటన్ కోర్టులు, కబడ్డీ, టెన్నిస్, వాలీబాల్, ఫుట్బాల్ కోర్టు, 200, 100 మీటర్ల రన్నింగ్ ట్రాక్, లాంగ్ జంప్కు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే చుట్టూ ప్రహరీని ఆనుకొని వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నారు. దీన్ని మల్టీ పర్పస్గా ఉపయోగపడేలా తయారు చేయాలని నిశ్చయించారు.
పనులు నిలిపివేయాలని..
స్టేడియం పనులు నిలిపివేయాలని 20 నెలల కిందట స్కూల్ మేనే జ్మెంట్ కమిటీ చైర్మన్ కలవేన బాలాజీ హై కోర్టును ఆశ్రయించారు. మైదానం పట్టణ నడిబొడ్డున ఉన్నందున అన్ని వర్గాల ప్రజలకు ఉపయో గకరంగా ఉంటుందని, ప్రజలకు అనువుగా ఉన్న ఒక్కగానొక్క స్థలాన్ని స్టేడియం నిర్మాణనికి వినియోగిస్తే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని, పైగా స్టేడియం నిర్మించే స్థలం ప్రభుత్వ భూమి కానందున పను లను నిలిపివేస్తూ ఆదేశిలివ్వాలని అభ్యర్థించారు. పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం పనులు ఆపివేయాలని గత ఏడాది అక్టోబరు 9న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదే శాలతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం క్రీడాకారులకు ఏరకమైన స్టేడియం కూడా అందుబాటులో లేకుండా పోయింది.
మున్సిపల్ స్థలానికి అభ్యంతరాలు..
జిల్లా కేంద్రంలో మెయిన్ స్టేడియం నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కలెక్టర్ భారతి హోళికేరి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అవస రమైన స్థలం కేటాయించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. దీంతో పట్టణంలోని రాళ్లవాగు సమీపంలోని పాత మంచిర్యాలలోగల మున్సిపల్ స్థలం సర్వే నంబర్లు 183, 184, 186లలోని 22. 14 ఎకరాల నుంచి మొత్తం 10.14 ఎకరాలను కేటాయిస్తూ అధికారులు ఏప్రిల్ 26న జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశంలో ఆమోదం కోసం కౌన్సిల్ ఎదుట పెట్టారు. స్థలం కేటాయింపునకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలపడంతో స్టేడియం నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని భావించారు. అయితే మున్సిపాలిటీ కేటాయించిన స్థలం కేంద్ర ప్రభుత్వా నికి చెందినది కావడంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. సదరు స్థలాన్ని భవిష్యత్ అవసరాల దృష్ట్యా గతంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేయడంతో పరిస్థితి యథాస్థితికి చేరింది. స్థలం కేం ద్రం ఆదీనంలో ఉన్నందున పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వం నుం చి ఆమోదం లభించేలా కృషి చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు.
క్రీడాకారులకు శాపం..
- కనపర్తి రమేశ్, జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి
దశాబ్దాల కాలంగా స్టేడియడం నిర్మాణానికి పునాదులు పడకపోవడం క్రీడాకారులకు శాపంగా పరిణమించింది. మంచిర్యాల జిల్లాలో క్రీడాకారు లకు కొదువ లేదు. భవిష్యత్తులో మంచిర్యాల క్రీడా హబ్గా వెలుగొందు తుందనడంలో అతిశయోక్తిలేదు. ఈ ప్రాంతం నుంచి జాతీయ, అంత ర్జాతీయ క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారు. స్టేడియం నిర్మిస్తే మరింత మందిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దే అవకాశం ఏర్పడుతుంది. ము న్సిపాలిటీ కేటాయించిన స్థలాన్ని స్టేడియం కోసం వినియోగించేలా ప్రజా ప్రతినిధులు కృషి చేయవలసిన అవసరం ఉంది.