పోడు భూముల సమస్యలను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-12-09T22:57:49+05:30 IST
పోడు భూముల సమస్యలను ప్రభుత్వం పరి ష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్లు తెలిపారు.
మందమర్రిటౌన్, డిసెంబరు 9: పోడు భూముల సమస్యలను ప్రభుత్వం పరి ష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్లు తెలిపారు. శుక్రవారం సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూ ముల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 21న తహసీల్దార్ కార్యాలయాల ఎదుట, 29న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతు న్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ సభల్లో బొగ్గు గనులను ప్రైవేటుపరం చేయనని చెబుతూనే నాలుగు బ్లాకులను వేలం పాటకు ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు భీమనాధుని సుదర్శన్, రేగుంట చంద్రశేఖర్, మేకల దాసు, నగేష్, లింగయ్య, మల్లయ్య, కలీందర్ఖాన్, రవి, సమ్మయ్య, పాల్గొన్నారు.