వేతనాలు విడుదల చేయాలి

ABN , First Publish Date - 2022-12-09T22:54:32+05:30 IST

మూడు నెలల పెండింగ్‌ వేతనాలను విడుదల చేయాలని మిషన్‌ భగీరథ గ్రిడ్‌ కార్మికులు శుక్రవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీవో శ్యామలాదేవికి వినతి పత్రం అం దించారు.

వేతనాలు విడుదల చేయాలి

బెల్లంపల్లి, డిసెంబరు 9: మూడు నెలల పెండింగ్‌ వేతనాలను విడుదల చేయాలని మిషన్‌ భగీరథ గ్రిడ్‌ కార్మికులు శుక్రవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీవో శ్యామలాదేవికి వినతి పత్రం అం దించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని, నాలుగు నెలలకు ఒకసారి నెల వేతనం చెల్లిస్తున్నారని తెలిపారు. వేతనాలు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. సమ్మె చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిం పులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-09T22:54:36+05:30 IST