చింతలమానేపల్లి, పెంచికలపేట మండలాల్లో అకాల వర్షం

ABN , First Publish Date - 2022-12-12T21:52:44+05:30 IST

చింతలమానేపల్లి, డిసెంబరు 12: మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో ఆదివారం రాత్రి మండలంలో అకాల వర్షం కురిసింది. చలితీవ్రత పెరిగింది. ఈ అకాల వర్షంతో పత్తి, వరి,మిరప పంటలు తడిసి ముద్దయ్యాయి. రవీంద్రనగర్‌, చింతలమానేపల్లిలో వడ్లకొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులుపడ్డారు.

చింతలమానేపల్లి, పెంచికలపేట మండలాల్లో అకాల వర్షం

చింతలమానేపల్లి, డిసెంబరు 12: మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో ఆదివారం రాత్రి మండలంలో అకాల వర్షం కురిసింది. చలితీవ్రత పెరిగింది. ఈ అకాల వర్షంతో పత్తి, వరి,మిరప పంటలు తడిసి ముద్దయ్యాయి. రవీంద్రనగర్‌, చింతలమానేపల్లిలో వడ్లకొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులుపడ్డారు.

పెంచికలపేట: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అకాల వర్షం నీటిపాలు చేసింది. ఆదివారం రాత్రి మండలవ్యాప్తంగా కురిసిన అకాలవర్షంతో అన్న దాతలు తిప్పలుపడ్డారు. పత్తి, కోతకు వచ్చిన పంటకు కొంత మేరకు నష్టం వాటి ల్లింది. గుంట్లపేట వరి కొను గోలు కేంద్రం పరిసరాలలో వర్షపు నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు. ఎల్లూరు గ్రామానికి చెందిన చంద్రయ్య అనే రైతు అయిదు క్వింటాళ్లవరి ధాన్యం ఇంటిఆవరణలో ఆరబెట్టడంతో తడిసి ముద్దయ్యాయి.

Updated Date - 2022-12-12T21:52:46+05:30 IST