జ్యోతిబాఫూలేకు ఘన నివాళి
ABN , First Publish Date - 2022-11-28T22:47:07+05:30 IST
జిల్లా వ్యాప్తంగా జ్యోతిబాఫూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఏసీసీ, నవంబరు 28: జిల్లా వ్యాప్తంగా జ్యోతిబాఫూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో పూలే వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య హాజరై పూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్గౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ పల్లె భూమేష్, మాజీ వైస్ చైర్మన్ నల్ల శంకర్, సీనియర్ నాయకులు తులా మధుసూదన్, బేర ప్రభాకర్, రాజలింగు, సుధాకర్, ప్రకాష్, రవింద్రనాథ్, రాజేషం, నరేంద్ర శ్రీనివాస్, ముడుపు రాంప్రకాష్, రాంబాబు, విజయ్, మంచర్ల సదానందం, బద్ది శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో టీవీయూవీ, టీపీవీఎస్ ఆధ్వర్యంలో ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు చేరాల వంశి, కిరణ్, గణేష్, శేఖర్, సురేష్, మల్లయ్య, రాజు, ప్రసాద్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఫూలే చిత్రపటానికి మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నీలకం టేశ్వర్రావు, వైస్చైర్మన్ ముఖేష్గౌడ్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనం తరం బహుజన సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో బహుజన తత్వవేత్త ఇట్యాల కిషన్, బుద్ది చంద్రమౌళి, బహుజన ఐక్య వేధిక నాయకులు రంగు రాజేషం, కనుకుంట్ల మల్లయ్య, ఎర్రోళ్ల నరేష్, నరెడ్ల శ్రీనివాస్, మేరుగు నరేందర్, కొమ్ముల శ్రీనివాస్, మెతె రాందాస్, నల్ల శంకర్, నల్లూరి మల్లయ్య, దుర్గం ఎల్లయ్య, మోహన్, పలిగిరి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట: అంబేద్కర్ విజ్ఞాన భవనంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు దొంత నర్సయ్య ఆధ్వర్యంలో ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు చిప్పకుర్తి నారాయణ, బైరం లింగన్న, అల్లంపల్లి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరు: పట్టణంలో ఫూలే వర్ధంతిని మహాత్మాజ్యోతిరావుఫూలే యువ జన సం ఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ అర్చనరాంలాల్గిల్డా హాజరె ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజుద్దీన్, కౌన్సిలర్లు రేవెల్లి మహేష్, జగన్నాధుల శ్రీనివాస్, కమ్మల శ్రీనివాస్, టీఆర్ఎస్నాయకులు లక్ష్మణ్, సతీష్రాజ్, నరసయ్య, తిరుపతి, కృష్ణ, జ్యోతి రావుపూలే యువజన సంఘం గౌరవాధ్యక్షుడు ప్రవీణ్, నాయకులు సురేష్, శ్రీనివాస్, ప్రశాంత్, కళాశాల లెక్చరర్లు బాల్రెడ్డి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. పాత బస్టాం డ్లోని ఫూలే విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయ కులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్య క్షుడు అంకగౌడ్, నాయకులు శ్రీధర్, లక్ష్మణ్, నాగరాజు, రాకేష్, సుమన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.