ఓటు విలువను గుర్తించాలి

ABN , First Publish Date - 2022-12-06T22:16:21+05:30 IST

సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం కోసం ఓటు విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.

ఓటు విలువను గుర్తించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ఆసిఫాబాద్‌, డిసెంబరు 6: సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం కోసం ఓటు విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్‌ రాజేశంతో కలిసి ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో ఓటు నమోదుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని చెప్పారు. పారదర్శకమైన సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో ఓటు హక్కు ప్రధాన మైనదని చెప్పారు. ఓటు హక్కు గల ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవడంతో పాటు 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరు ఓటు వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 8వ తేదీన ఓటు నమోదుకు ఆఖరి తేదీగా నిర్ణయించినందున అర్హత గల వారందర నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మణెమ్మ, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T22:16:22+05:30 IST