మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-01-04T04:28:32+05:30 IST
మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు న్యాల శ్రీదేవి అన్నారు. బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం నిర్వహించారు.
తాండూర్, జనవరి 3: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించా లని సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు తహసీల్దార్, ఎంపీ డీవో, ఎంఈవోలకు సోమవారం వినతిపత్రాలు అందించారు. సీఐటీయూ నాయకులు దాగం రాజారాం, బొల్లం రాజే శంలు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొ న్నారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, ప్రభుత్వమే ఎగ్స్ సరఫరా చేయాలని, కనీస వేతనం రూ. 21 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు మొగిలి, పాపయ్య, కార్మికులు పాల్గొన్నారు.
జన్నారం: మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు న్యాల శ్రీదేవి అన్నారు. బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం నిర్వహించారు. ప్రతీనెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని, నెలకు రూ.21 వేల వేతనం చెల్లించాల న్నారు. అమృత, మగ్గిడి లక్ష్మీ, గంగాధర్, రాజేశ్వరి, శంకరమ్మ, శారద పాల్గొన్నారు.