దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-12-02T00:53:45+05:30 IST

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోనే కలెక్టరేట్‌ ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆఽధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు.

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 1: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోనే కలెక్టరేట్‌ ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆఽధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సమితి జి ల్లా అధ్యక్షుడు ప్రేమ్‌రాజ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా దివ్యాంగులకు రూ. 6 వేల పింఛన్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దళిత బంధు పథకంలా దివ్యాంగుల బంధు ప్రకటించాలని కోరారు. అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలని, 150 రోజుల ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించాలని అన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌లు కేటాయించాలని లేనిపక్షంలో సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామన్నారు. కార్యక్రమంలో సమితి సభ్యులు బాలాజీ, నాందేవ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-02T00:53:47+05:30 IST