రైతు చేతుల మీదుగా కేవీకే భవనం ప్రారంభం
ABN , First Publish Date - 2022-09-20T03:47:10+05:30 IST
నెన్నెల మండలం నందులపల్లి యువరైతు కొండపల్లి శరత్కు అరుదైన గౌరవం దక్కింది. బెల్లంపల్లిలో రూ.2 కోట్లతో నిర్మించిన కృషి విజ్ఞాన కేంద్రం భవనాన్ని సోమవారం శరత్ చేతుల మీదుగా ప్రారం భించారు. ఐసీఏఆర్ డిప్యూ టీ డైరెక్టర్ జనరల్ (న్యూఢిల్లీ) డాక్టర్ ఏకే సింగ్, ప్రొఫెసర్ జయశం కర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్స్లర్ రఘునందన్రావులు ఆన్ లైన్లో పాల్గొనగా, శరత్ భవనాన్ని ప్రారంభిచాడు.
నెన్నెల, సెప్టెంబరు 19: నెన్నెల మండలం నందులపల్లి యువరైతు కొండపల్లి శరత్కు అరుదైన గౌరవం దక్కింది. బెల్లంపల్లిలో రూ.2 కోట్లతో నిర్మించిన కృషి విజ్ఞాన కేంద్రం భవనాన్ని సోమవారం శరత్ చేతుల మీదుగా ప్రారం భించారు. ఐసీఏఆర్ డిప్యూ టీ డైరెక్టర్ జనరల్ (న్యూఢిల్లీ) డాక్టర్ ఏకే సింగ్, ప్రొఫెసర్ జయశం కర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్స్లర్ రఘునందన్రావులు ఆన్ లైన్లో పాల్గొనగా, శరత్ భవనాన్ని ప్రారంభిచాడు. డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ సత్యనారాయణ, జోనల్ హెడ్ ఉమాదేవి, కేవీకే ప్రొగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వర్నాయక్, శాస్త్రవే త్తలు శివకృష్ణ, తిరుపతి, నాగరాజు, స్రవంతి, సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శరత్ను ఘనంగా సన్మానించారు.