ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-11-28T22:33:24+05:30 IST

నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, సవరణలు, తొలగింపునకు డిసెంబరు 3, 4వ తేదీలలో జిల్లాలో చేపడుతున్న ప్రత్యేక శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు.

ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
గోడ ప్రతులను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ భారతి హోళికేరి

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 28: నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, సవరణలు, తొలగింపునకు డిసెంబరు 3, 4వ తేదీలలో జిల్లాలో చేపడుతున్న ప్రత్యేక శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్లు మధుసూదన్‌ నాయక్‌, బి. రాహుల్‌తో కలిసి ఓటరు జాబితా సవరణ, నూతన ఓటరు నమోదు సంబంధిత గోడప్రతులను సోమవారం కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పోలింగ్‌ కేంద్రంలో బూత్‌ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటా రని చెప్పారు. ఓటర్లు తమ వివరాలను పరిశీలన చేసుకునేందుకు సంబంధిత జాబితా అందుబాటులో ఉంటుందన్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు బూత్‌ స్థాయి అధికారులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T22:33:25+05:30 IST