మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలి
ABN , First Publish Date - 2022-12-13T23:14:47+05:30 IST
మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
ఆసిఫాబాద్, డిసెంబరు 13: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమను పర్మనెంట్ చేయాలని అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్లుగా రూ.21 వేల వేతనం ఇవ్వాలని కోరారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులను మోసం చేసిందన్నారు. కార్మికులకు దళితబంధు, డబుల్ బెడ్రూం తదితర పథకాలను వర్తింజేయాలని కోరారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్, శంకర్, సంజీవ్, శంకరమ్మ, రాజన్న, శంకర్, అంజన్న, రమేష్, రవి, అజ్జు, కుమార్, స్వామి, మల్లేష్, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.