‘మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవనంలోకి రావాలి’

ABN , First Publish Date - 2022-10-02T04:08:50+05:30 IST

మావోయి స్టులు అజ్ఞాతంవీడి జనజీవనంలోకి రావాలని ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. శనివారం పెంచికలపేట మండలం ఆగర్‌గూడలో పర్య టించి 35సంవత్సరాల నుంచి మావోయి స్టు గా పనిచేస్తున్న చౌదరిఅంకుబాయి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

‘మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవనంలోకి రావాలి’
మావోయిస్టు చౌదరి అంకుబాయి కుటుంబానికి సరుకులు పంపిణీ చేస్తున్న ఎస్పీ సురేష్‌కుమార్‌

- ఎస్పీ సురేష్‌ కుమార్‌

పెంచికలపేట, అక్టోబరు 1: మావోయిస్టులు అజ్ఞాతంవీడి జనజీవనంలోకి రావాలని ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. శనివారం పెంచికలపేట మండలం ఆగర్‌గూడలో పర్య టించి 35సంవత్సరాల నుంచి మావోయి స్టు గా పనిచేస్తున్న చౌదరిఅంకుబాయి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అతడి సోద రుడు చౌదరి చిన్నన్నతో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకుని పండ్లు, బట్టలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అజ్ఞాత నక్సలైట్లు జన జీవన స్రవంతిలో కలిసేలా చూడాలని కుటుంబ సభ్యులను కోరారు. చౌదరి అంకుబాయి జనజీవన స్రవంతిలో కలిస్తే అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయి, కుటుంబసభ్యులతో ఆనందమైన జీవితం గడపాలని ఎస్పీకోరారు. డీఎస్పీ కరుణాకర్‌, సీఐ నాగరాజు, ఎస్సై సనత్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-10-02T04:08:50+05:30 IST