ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిబాఫూలే వర్ధంతి

ABN , First Publish Date - 2022-11-28T22:17:33+05:30 IST

ఆసిఫాబాద్‌, నవంబరు 28:ఆసిఫాబాద్‌ పట్టణంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం జ్యోతిబా ఫూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఫూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిబాఫూలే వర్ధంతి

ఆసిఫాబాద్‌, నవంబరు 28:ఆసిఫాబాద్‌ పట్టణంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం జ్యోతిబా ఫూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఫూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. రూప్‌నార్‌ రమేష్‌,చరణ్‌, సుధాకర్‌, చిరంజీవి, దినకర్‌ శ్యాంరావు, సాయిరాం, ధర్మయ్య, జయరాజ్‌ ఆసీఫ్‌, ప్రవీణ్‌, ప్రణయ్‌, తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి: మండలంలో, గ్రామాల్లో జ్యోతిబాఫూలే విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. జడ్పీటీసీ అజయ్‌కుమార్‌, ఎంపీపీ విమలబాయి, మాలి, ఆరెసంఘం నాయకులున్నారు.

బెజ్జూరు: రైతువేదికలో మహాత్మజ్యోతిబాఫూలే పూలే చిత్రపటానికి ఎంపీపీ రోజారమణి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జడ్పీటీసీ పుష్పలత, బషరత్‌ఖాన్‌, ఎంపీటీసీ పర్వీన్‌సుల్తానా, శ్రీనివాస్‌, వెంకన్న, సర్పంచ్‌ శారద తదితరులు పాల్గొన్నారు.

కౌటాల: మండలంలో మాలి సంఘం రాష్ట్ర అధ్య క్షుడు శ్యాంరావు, రాష్ట్రకార్యదర్శి వసంత్‌రావు జ్యోతిబా ఫూలే, అంబేద్కర్‌, కుమరంభీం, జగ్జీవన్‌రాం విగ్రహాల కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

సిర్పూర్‌(టి):సిర్పూర్‌(టి) బస్టాండుఏరియాలో బీజేపీనాయకుడు హరీష్‌బాబుజ్యోతిబా ఫూలేచిత్రప టానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

రెబ్బెన: మండలంలోని కొండపల్లిలో ఫూలే సేవాసమితి జిల్లా అధ్యక్షుడు తిరుపతి మోర్లే మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానీయుడు జ్యోతి బాఫూలే అన్నారు.

Updated Date - 2022-11-28T22:17:35+05:30 IST