పశు వైద్యశాలల తనిఖీ
ABN , First Publish Date - 2022-12-13T22:11:42+05:30 IST
కత్తెరశాల, చెన్నూర్ పట్టణంలోని పశు వైద్యశాలలను జిల్లా పశువైద్యాధికారి వై.రమేష్, జిల్లా పశువైద్య సహాయ సం చాలకులు శంకర్ మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పశు వుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు తెలిపారు.
చెన్నూర్ రూరల్, డిసెంబరు 13: కత్తెరశాల, చెన్నూర్ పట్టణంలోని పశు వైద్యశాలలను జిల్లా పశువైద్యాధికారి వై.రమేష్, జిల్లా పశువైద్య సహాయ సం చాలకులు శంకర్ మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పశు వుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు తెలిపారు. పశు వైద్యశాల శిథిలా వస్థలో ఉండడంతో తాత్కాలిక భవనాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీడీవోకు తెలిపారు. పశువైద్యాదికారి డా, శ్రీనివాస్, సిబ్బంది పాల్గోన్నారు.
భీమారం: మండలంలోని పశు వైద్యశాలను జిల్లా పశువైద్యాధికారి రమేష్ తనిఖీ చేశారు. పశువులకు అందిస్తున్న వైద్య సేవలు, మందుల రికార్డులను పరి శీలించారు. పశువైద్య శాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పాడి పశువుల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించాలని సూచించారు. సహాయ సంచాలకులు శంకర్, పశువైద్యాధికారి రాకేష్శర్మ, సిబ్బంది నర్సింహులు, సంపత్, రమేష్ పాల్గొన్నారు.