విద్యుత్ నష్టాలపై ప్రత్యేక బృందాల తనిఖీ
ABN , First Publish Date - 2022-10-05T06:20:03+05:30 IST
రెవెన్యూ డివిజన్ కేంద్రమైన భైంసాలో మంగళవారం ట్రాన్స్కో అధికార యంత్రాంగం విద్యుత్ యూనిట్ల నష్టాల వివరాల, సేకరణ కోసం గాను ముమ్మర తనిఖీలు చేపట్టింది.
భైంసా,అక్టోబరు 4 : రెవెన్యూ డివిజన్ కేంద్రమైన భైంసాలో మంగళవారం ట్రాన్స్కో అధికార యంత్రాంగం విద్యుత్ యూనిట్ల నష్టాల వివరాల, సేకరణ కోసం గాను ముమ్మర తనిఖీలు చేపట్టింది. గత కొంత కాలంగా సబ్స్టేషన్ పరిధిలో ఇన్పుట్, అవుట్పుట్ విద్యుత్ యూనిట్లలో అధికంగా తేడాలండటానిన గుర్తించిన ట్రాన్స్కో అధికారులు నివారణ చర్యలకు ఉప క్రమించారు. ఇందులో భాగంగానే మంగళవారం ఉదయం నుంచి పట్టణంలోని ఏడు ఫీడర్ల పరిధిలో తనికీలు నిర్వహింపజేశారు. డివిజన్ పరిధిలోని ఆయా సబ్స్టేషన్ల పరిధిలో గల విద్యుత్ అధికారులు, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లను 28బృంధాలుగా ఏర్పర్చి పోల్టూ పోల్ పరిశీలన చేపట్టారు. ప్రతి పోల్ పరిధిలోని గృహ, వాణిజ్య కనెక్షన్లకు సంబంధించి మీటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలను నమోదు చేశారు. ఉదయం ప్రారంభమైన తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగాయి.