కుంటాల ఆశ్రమ పాఠశాల పరిశీలన

ABN , First Publish Date - 2022-08-21T06:16:01+05:30 IST

నేరడిగొండ, ఆగస్టు 20: కుంటాల బాలికల ఆశ్రమ పాఠశాలను ఐటీ డీఏ పీవో వరుణ్‌రెడ్డి పరిశీలించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి డాక్టర్ల ద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసు కున్నారు. మొన్నగిరిజన బాలికల భాగ్యశ్రీ మృతిపై కమిటీని వేశామని కారకులు ఎవరైనా చర్యలు తీసుకుంటామన్నారు. నిన్న రిమ్స్‌లో చేరిన బాలికలు ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. ఏఎన్‌ఎంలను పాఠశాలలో ఎందుకు తీసేశారని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధా నం ఇస్తూ ఏఎన్‌ఎం నియామకం రాష్ట్ర పరిధిలో ఉందని దాటి వేశారు. ఐటీడీఏ పీవో ఆశ్రమ స్కూల్‌ ఆవరణమంతా తిరిగి పరిసరాలు శుభ్రం గా ఉంచుకోవాలని ఆదేశించారు. బీజేపీ జిల్లా అధికార ప్రతి నిధి లోక ప్రవీణ్‌రెడ్డి, జడ్పీటీసీ అనిల్‌జాదవ్‌, ఎంపీపీ రాథోడ్‌సజన్లు ఉన్నారు.

కుంటాల ఆశ్రమ పాఠశాల పరిశీలన

నేరడిగొండ, ఆగస్టు 20: కుంటాల బాలికల ఆశ్రమ పాఠశాలను ఐటీ డీఏ పీవో వరుణ్‌రెడ్డి పరిశీలించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి డాక్టర్ల ద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసు కున్నారు. మొన్నగిరిజన బాలికల భాగ్యశ్రీ మృతిపై కమిటీని వేశామని కారకులు ఎవరైనా చర్యలు తీసుకుంటామన్నారు. నిన్న రిమ్స్‌లో చేరిన బాలికలు ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. ఏఎన్‌ఎంలను పాఠశాలలో ఎందుకు తీసేశారని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధా నం ఇస్తూ ఏఎన్‌ఎం నియామకం రాష్ట్ర పరిధిలో ఉందని దాటి వేశారు. ఐటీడీఏ పీవో ఆశ్రమ స్కూల్‌ ఆవరణమంతా తిరిగి పరిసరాలు శుభ్రం గా ఉంచుకోవాలని ఆదేశించారు. బీజేపీ జిల్లా అధికార ప్రతి నిధి లోక ప్రవీణ్‌రెడ్డి, జడ్పీటీసీ అనిల్‌జాదవ్‌, ఎంపీపీ రాథోడ్‌సజన్లు ఉన్నారు.





Updated Date - 2022-08-21T06:16:01+05:30 IST