గ్రంథాలయ సర్వ సభ్య సమావేశం
ABN , First Publish Date - 2022-09-28T03:50:28+05:30 IST
సంచాకులు, పౌర గ్రంథాలయ శాఖ ఉత్తర్వుల మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ యాదవ్రావు అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్ రూరల్, సెప్టెంబరు 27: సంచాకులు, పౌర గ్రంథాలయ శాఖ ఉత్తర్వుల మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ యాదవ్రావు అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా 2022-23 సంవత్సరానికి ఆమోదం పొందిన పద్దులకు బడ్జెట్ ఖర్చు చేయడానికి ఆమోదం కోసం ఆన్ డిమాండ్ బుక్స్ కొనుగోలు, టెలిఫోన్, ఇంటర్నెట్ చార్జీల బడ్జెట్ అంచనాలను ప్రతిపాదించారు. ఈ సందర్భంగా చైర్మన్ యాదవ్రావు మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని అన్ని శాఖ గ్రంథాలయాల్లో గల 021-21, 2021-22 సంవత్సరానికి సంబంధించిన పాత దిన, వార, పక్ష, మాస పత్రికలు, స్ర్కాప్ విక్రయానికి ఆమోదం తెలిపారని వివరించారు. కార్యక్రమంలో డీఈవో అశోక్, ఏసీజీఈ ఉదయ్బాబు, డీపీవో ప్రశాంత్, కార్యదర్శి మునశ్వ ర్రావు, వెంకటరమణ, సదానందం, మజీద్ సలీం, రామయ్య తదితరులు పాల్గొన్నారు.