వైభవంగా గణేష్ నిమజ్జనం
ABN , First Publish Date - 2022-09-11T04:01:01+05:30 IST
ఆసిఫాబాద్ పట్ట ణంలో శనివారం పలుకాలనీల్లో ప్రతిష్టించిన వినాయ కవిగ్రహాలను నిర్వహకులు నిమజ్జనం చేశారు. పట్టణంలోని సాయికాలనీ, బ్రాహ్మణ్వాడ, బాపునగర్ కాలనీల్లో ప్రతిష్ఠించిన గణనాథులకు నిమజ్జనం నిర్వహించారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 10: ఆసిఫాబాద్ పట్ట ణంలో శనివారం పలుకాలనీల్లో ప్రతిష్టించిన వినాయ కవిగ్రహాలను నిర్వహకులు నిమజ్జనం చేశారు. పట్టణంలోని సాయికాలనీ, బ్రాహ్మణ్వాడ, బాపునగర్ కాలనీల్లో ప్రతిష్ఠించిన గణనాథులకు నిమజ్జనం నిర్వహించారు. ఈ సంద ర్భంగా బాపునగర్ శారదగణేష్ మండప గణనాథుడి వద్ద నవరాత్రులు పూజలం దుకున్న రూ.21వేల విలువ గల కరెన్సీదండను రూ.55 వేలకు సాయిని నర్సింహులు దక్కించుకున్నాడు. లడ్డూను రూ.30 వేలకు పుల్లూరి రవీందర్ దక్కించుకున్నాడు. 50 గ్రాముల వెండీ లక్కీడ్రా విజేతగా సుదర్శణ్ నిలువగా గెలుపొందిన వారికి జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, మాజీఎంపీపీ బాలేష్గౌడ్ బహుమతులు ప్రదానం చేశారు. నిమ జ్జనం సందర్భంగా మహిళల నృత్యాలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి.
వాంకిడి: మండలకేంద్రంలో శనివారం గణేష్ నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. వినాయక విగ్ర హాలను మండల కేంద్రంలోని ప్రధానవీధుల గుండా భాజాభజంత్రీలతో ఉరేగిస్తూ నృత్యాలు చేశారు. అనంతరం స్థానిక చికిలివాగులో నిమజ్జనం చేశారు.