సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం

ABN , First Publish Date - 2022-08-18T04:38:32+05:30 IST

వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాటం సాగిస్తామని ఆ సంఘం జిల్లా అద్యక్షుడు దుర్గం శ్రీనివాస్‌, సాగె ఓంకార్‌ అన్నారు.

సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం
జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తున్న వీఆర్‌ఏలు

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు  17 :  వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాటం సాగిస్తామని ఆ సంఘం జిల్లా అద్యక్షుడు దుర్గం శ్రీనివాస్‌,  సాగె ఓంకార్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు వీఆర్‌ఏలు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వీఆర్‌ఏ జేఏసీ నాయకులు గణపతి, పర్వతాలు, జనార్ధన్‌, కమలాకర్‌, రత్నం, ప్రదీప్‌, తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-08-18T04:38:32+05:30 IST