అభివృద్ధి పనులపై వార్డుల్లో పర్యటించిన చైర్మన్
ABN , First Publish Date - 2022-03-16T07:23:49+05:30 IST
పట్టణంలోని బంగల్పేట్ మహాలక్ష్మి కాలనీ, జంగల్ హనుమాన్ కాలనీల్లో పలు అభివృద్ధి పనులపై మున్సిపల్ చైర్మన్ గండ్ర త్ ఈశ్వర్ తెలుసుకున్నారు.
నిర్మల్ చైన్గేట్, మార్చి 15 : పట్టణంలోని బంగల్పేట్ మహాలక్ష్మి కాలనీ, జంగల్ హనుమాన్ కాలనీల్లో పలు అభివృద్ధి పనులపై మున్సిపల్ చైర్మన్ గండ్ర త్ ఈశ్వర్ తెలుసుకున్నారు. 42 వార్డుల్లో అభివృద్ధి పనులు చేస్తూ ఎలాంటి సమ స్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కరిం చడం జరుగుతుందన్నారు. ఆయన వెంట ఏఈ వినయ్కుమార్, శానిటరీ ఎస్సై మురారి, కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్, నల్లూరి పోశెట్టి, కోఆప్షన్ సభ్యులు చిలుక గో వర్ధన్, మహాలక్ష్మి ఆలయ చైర్మన్ కొడుకుల గంగాధర్, శివభూపతి పాల్గొన్నారు.