కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2022-06-12T04:22:48+05:30 IST
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సం క్షేమ పథకాలను ప్రజలు, అసంఘటిత రంగ కార్మికులు సద్వినియోగం చేసు కోవాలని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కొయ్యల ఏమాజీ పేర్కొన్నారు. శని వారం కాంటా చౌరస్తాలో ప్రధాని ప్రవేశపెట్టిన పథకాలతో ముద్రించిన కరప త్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మి కులు ప్రమాదవశాత్తు మృతిచెందితే రూ. 5 లక్షలు, గాయపడితే రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.
బెల్లంపల్లి, జూన్ 11: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సం క్షేమ పథకాలను ప్రజలు, అసంఘటిత రంగ కార్మికులు సద్వినియోగం చేసు కోవాలని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కొయ్యల ఏమాజీ పేర్కొన్నారు. శని వారం కాంటా చౌరస్తాలో ప్రధాని ప్రవేశపెట్టిన పథకాలతో ముద్రించిన కరప త్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మి కులు ప్రమాదవశాత్తు మృతిచెందితే రూ. 5 లక్షలు, గాయపడితే రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. బీజేపీ జిల్లా కార్యదర్శి గోవర్దన్, కౌన్సిలర్ అనితరాజులాల్యాదవ్, నాయకులు కేశవరెడ్డి, మోహన్, పాల్గొన్నారు.
మందమర్రి: చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోవడం లేదని బీజేపీ పట్టణ అధ్యక్షుడు మహంకాళి శ్రీనివాస్ తెలిపారు. క్యాతన్పల్లిలోని 7, 10 వార్డుల్లో బీజేపీ సాధించిన విజయాల కరపత్రాలను పంపిణీ చేశారు. నాయకులు సత్యనారాయణ, రవిందర్, బైర మల్లేష్, బాలకృష్ణ, పాల్గొన్నారు.