సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు
ABN , First Publish Date - 2022-11-28T22:15:03+05:30 IST
ఆసిఫాబాద్, నవంబరు 28: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రను ఆపేందుకు కుట్రలు చేస్తున్న సీఎం కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ సోమవారం బీజేపీ నాయకులు కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు.
ఆసిఫాబాద్, నవంబరు 28: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రను ఆపేందుకు కుట్రలు చేస్తున్న సీఎం కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ సోమవారం బీజేపీ నాయకులు కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్నాక విజయ్కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ మట్లాడుతూ ఈరోజు ప్రారంభం కావాల్సిన ప్రజాసంగ్రామ యాత్ర సభను యథావిధిగా కొనసాగించవచ్చని అనుమతి రావడంతో కేసీఆర్ ప్రభుత్వానికి చెప్పుతో కొట్టినట్లు అయిందన్నారు. ఎమ్మెల్యేల అవినీతి బయటపడు తుండడంతో దిక్కుతోచక ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడని ఆరోపిం చారు. నాయకులు కిరణ్కుమార్, ఆత్మారాం నాయక్, సురేష్, కోవ విజయ్, దాదిరావు, దౌలత్రావు, భాను తదితరులు పాల్గొన్నారు.
కాగజ్నగర్: కాగజ్నగర్ పట్టణంలో బీజేపీ నాయకులు సోమవారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. బీజేపీ నాయకుడు డాక్టర్ హరీష్బాబు మాట్లాడుతూ ప్రజా సంగ్రామ యాత్రకు వెళ్లుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను అరెస్టు చేయటం దారుణమన్నారు.