Bandi Sanjay: కేసీఆర్‌ను చూసి దేశమంతా నవ్వుకుంటోంది..

ABN , First Publish Date - 2022-12-02T16:10:19+05:30 IST

పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ (Checks Bounce) కావడంతో సీఎం కేసీఆర్‌ (CM KCR)ను చూసి దేశమంతా నవ్వుకుంటోందని బండి సంజయ్ అన్నారు.

Bandi Sanjay: కేసీఆర్‌ను చూసి దేశమంతా నవ్వుకుంటోంది..

నిర్మల్ జిల్లా: పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ (Checks Bounce) కావడంతో సీఎం కేసీఆర్‌ (CM KCR)ను చూసి దేశమంతా నవ్వుకుంటోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా, నందన్ గ్రామంలో పాదయాత్ర (Padayatra) చేస్తున్న ఆయన మాట్లాడుతూ లిక్కర్ (Liquor), క్యాసినో (Casino) దందాల్లో కేసీఆర్ బిడ్డ వేల కోట్ల పెట్టుబడులు పెట్టారని, ఇక్కడున్నవి బెల్ట్ షాపులు కాదని.. అవి కేసీఆర్ షాపులని ఆరోపించారు. ముఖ్యమంత్రి 100 రూములతో ఇల్లు కట్టుకున్నారని, 300 ఎకరాల్లో వ్యవసాయం చేస్తు కోట్లు గడిస్తున్నారని.. రైతులు మాత్రం అప్పుల పాలవుతున్నారని అన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల రూపాయల విలువైన జాగాలను కబ్జా చేసేందుకే 'ధరణి (Dharani)' తెచ్చారని విమర్శించారు. తెలంగాణ రైతులను పట్టించుకోని కేసీఆర్.... పంజాబ్ రైతులకు మాత్రం మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారని.. చివరికి ఆ చెక్కులు బౌన్స్ అవడంతో తెలంగాణ ఇజ్జత్ పోయిందన్నారు. పేదోళ్ల సమస్యలు, బాధలను తెలుసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశిస్తేనే... పాదయాత్ర చేస్తున్నానని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-02T16:10:25+05:30 IST